telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

వినియోగదారులకు ఎయిర్ టెల్ సరికొత్త ఆఫర్!

Airtel

ప్రముఖ టెలీకాం సంస్థ ఎయిర్ టెల్ వినియోగదారులకు సరికొత్త ప్యాక్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 401 ప్రీపెయిడ్ ప్యాక్ తో రోజుకు 3 జీబీడేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. ఇదే సమయంలో ఏడాది పాటు డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ ఉచితం. ఈ ప్యాక్ లో కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు ఉండవు. వాస్తవానికి డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ ప్యాక్ చందా ఏడాదికి రూ. 399 . ఇక ఎయిర్ టెల్ చందాదారులకు రోజుకు 3 జీబీ డేటాతో పాటు, ప్యాక్ ముగిసిన తరువాత కూడా ఏడాది పాటు చందా అందుబాటులో ఉంటుంది.

వినియోగదారులు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ ప్లాన్ ను తీసుకుంటే సరిపోతుందని, ఆపై ఏ ఇతర ప్లాన్ తో అయినా తమ ఫోన్ నంబర్ ను రీచార్జ్ చేసుకుని కాలింగ్, మెసేజ్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది.ఇదిలావుండగా, ఎయిర్ టెల్ రూ. 398 ప్రీ పెయిడ్ ప్లాన్ లో అమెజాన్ ప్రైమ్ చందా ఉచితంగా అందుతుందన్న సంగతి తెలిసిందే. ఇందులో వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు కూడా అందుతాయి.

Related posts