telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంటికి చేరుకున్న ఆసీస్ ఆటగాళ్లు…

ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడిన మూడు వారాల తరువాత వారు ఇంటికి చేరుకున్నారు ఆసీస్ ఆటగాళ్లు. కుటుంబాన్ని కలుసుకున్నారు. వారు ఇంటికొచ్చిన సందర్భంగా భార్యా బిడ్డలు, ఇతర కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఎప్పుడూ లేనివిధంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి మరీ వారిని రిసీవ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, పాట్ కమ్మిన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రసవత్తరంగా సాగుతోన్న ఐపీఎల్ 2021 సీజన్‌పై కరోనా వైరస్ పంజా విసిరిన విషయం తెలిసిందే. వృద్ధిమాన్ సాహా, ప్రసిద్ధ కృష్ణ సహా కొందరు క్రికెటర్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. అదే సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న నగరాలు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతల్లో పెద్ద ఎత్తున రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఈ నెల 4వ తేదీన టోర్నమెంట్‌ను అర్ధాంతరంగా రద్దు చేసింది. ఆ తరువాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.

Related posts