పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీ తరువాత సినిమాలకు దూరమైనప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆయన బర్త్డేని అభిమానులు వేడుకలా జరుపుకున్నారు. అభిమానులు, సెలబ్రిటీలు పవన్కి సోషల్ మీడియా వేదికగా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో పవన్ ఇండియాలో టాప్ 1గా ట్రెండింగ్ అయ్యారు. ఈ క్రమంలో పవన్ నటించిన “కొమరం పులి” చిత్రంలో కథానాయికగా నటించిన నికీషా పటేల్ పొరపాటున “పావలా కళ్యాణ్” అంటూ పోస్ట్ చేసింది. దీనితో పవన్ అభిమానులు నికీషా పై ఆగ్రహంతో ట్రోల్ చేయడం ప్రారంభించారు. మీడియాలో కూడా ఈ వార్త హైలైట్ అయింది. వెంటనే స్పందించిన నికీషా పొరపాటున ఆ హ్యాష్ ట్యాగ్ జత చేశానని, కొంతమంది ఇడియట్స్ ఆ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడం వల్లే పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చింది. మీడియా, పవన్ అభిమానులు ఇకపై సైలెంట్ అయిపోవాలని కోరింది. పవన్ పై తనకు గౌరవం ఉందని ఆయన్ని కించపరచాలనే ఉద్దేశం లేదని నికీషా తెలిపింది. ఈ మొత్తం వివాదంపై మరో హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందిస్తూ నికీషా పటేల్ కు మద్దతు తెలిపింది. “నికీషా ఎవరి కోసమో నువ్వు నీ నిజాయతీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా నువ్వు ఓ మీడియా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నావు. ఈ నెగిటివిటీని పట్టించుకోవద్దు” అని నికీషాకు పూనమ్ కౌర్ సూచించింది.
U @Nikeshapatel don’t have prove your loyalty to people … just keep quiet … other wise they will only have fun … remember your interview was altered by a wicked journalist which affected your career …have fun … be at peace …
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 3, 2019
సంగీత దర్శకుడిపై అనంత శ్రీరామ్ వ్యాఖ్యలు