ఉత్తరాఖండ్ సీఎం ఓఎస్డీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఉత్తరాఖండ్ రాష్ర్ట మంత్రి వర్గ సమావేశం ఇవాళ జరగాల్సి ఉండగా సీఎం ఓఎస్డీకి కరోనా సోకడంతో మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.
ఆగస్టు 25 నుంచి మూడు రోజుల పాటు సీఎం స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. సీఎం సలహాదారుల్లో ఒకరికి కొవిడ్ నిర్ధారణ కావడంతో అప్పట్లో మూడు రోజుల పాటు సీఎం విధులకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు ముందస్తు చరయాల్లో భాగంగా సీఎం రావత్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
కాంగ్రెస్ ఓటమి పాలైతే నాదే బాధ్యత: సీఎం అమరీందర్