telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రెండు జిల్లాల ఎమ్మెల్యేలపై కేశినేని సెటైర్లు

kesineni-nani

ఏపీ రాజధానిని విశాఖపట్నం తరలిస్తామన్న ప్రకటనను స్వాగతిస్తున్నామని కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పడంపై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, ప్రపంచంలో ఇటువంటి వింతను ఎక్కడా చూడలేదన్నారు.

“ప్రపంచంలో ఎక్కడా ఈ వింత పోకడ చూడలేదు ఎక్కడైనా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండని పోరాడే ప్రజాప్రతినిధులను చూసాము . మన ప్రాంత దౌర్భాగ్యం ఏమిటో ఇక్కడి రాజధానిని విశాఖ తీసుకు పోతున్నామంటే పదవుల కోసం జీ హుజూర్ నీ కాళ్ళు మొక్కుతా అనే ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీలో వుండటం మన కర్మ” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Related posts