telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సోనియా గాంధీ వలనే తెలంగాణ: ఉత్తమ్‌

యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ వలనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని టీపీసీపీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో ఉత్తమ్ జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుద్టు పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు పోరాటం చేయడం వల్లనే ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2లక్షల 60 వేల కోట్ల అప్పు అయ్యిందన్నారు. విభజన హామీలు అమలు చేయడం లో కేంద్రం విఫలమయ్యిందన్నారు.

గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ వ్యాగన్ ఫ్యాక్టరీ. టీఎస్‌పీఎస్‌లో నమోదు చేసుకున్న నిరుద్యోగులే 12 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అయిన నిరుద్యోగ భృతి విధి విధానాలు రూపొందించలేదు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. ప్రజాస్వామ్య బద్ధమైన రంగాలను ప్రభుత్వం అణచి వేస్తుంది. ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ఎమ్మెల్యే లను కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Related posts