ఇటీవల విమానాలలో ప్రయాణికులు అనేక విచిత్ర చేష్టలు చేస్తున్న వార్తలు అనేకం వైరల్ అవుతున్నాయి. తాజాగా ప్రయాణి కులకు ఇబ్బంది కలిగించేలా విమానంలో యోగా, వ్యాయామం చేసిన శ్రీలంకకు చెందిన వ్యక్తిని అధికారులు విమానం నుంచి దించేశారు. చెన్నై నుంచి శ్రీలంకకు వెళ్లే స్పైస్జెట్ విమానంలో బుధవారం ఉదయం ప్రయా ణికులు ఎక్కుతుండగా ఓ వ్యక్తి విమాన ప్రవేశ ద్వారం వద్ద యోగాసనాలు, వ్యాయామం చేయడం గమనించిన ప్రయాణికులు విమాన సిబ్బందికి తెలియ జేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలి గించే చర్యలు మానుకోవాలని సిబ్బంది అతనికి నచ్చచెప్పినా పట్టించుకోకుండా యోగాసనాలు ఆపలేదు. దీంతో, సిబ్బంది కంట్రోల్రూమ్కు సమాచారం అందిం చారు.
సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఆ ప్రయాణికుడిని కిందకు దించి అధికారుల కు అప్పగించారు. వారు విచారించగా అతను శ్రీలంకకు చెందిన గుణసేన అని, అమెరికా పాస్పోర్ట్తో అమెరికా నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి వారణాసి వెళ్లి తరు వాత చెన్నై చేరుకొని శ్రీలంకకు వెళుతు న్నట్లు తేలింది. అనంతరం తనను ఆ విమానంలో పంపించాలని గుణసేన అభ్యర్ధన నిరాకరించిన అధికారులు అతని కి టిక్కెట్ నగదు వాపసు చేసి, విమా నాశ్రయ పోలీసులకు అప్పగించారు. వారు అతడిని శ్రీలంక దౌత్యకార్యాల యానికి తీసుకెళ్లారు.