telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

షర్మిల ఫిర్యాదుపై..ఆరుగురు అరెస్టు

YS  Sharmila Social Media Case Hyderabad
సినీనటుడు ప్రభాస్‌తో తనకు సంబంధాలున్నట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై  పోలీసులు విచారణ వేగవంతం చేశారు.  దీంతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు షర్మిలపై అసత్య ప్రచారాలు 15 సోషల్ మీడియా వెబ్ సైట్లను గుర్తించారు. 
షర్మిలపై నెగిటివ్ గా ప్రచారం చేసిన వారిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హైదరాబాద్‌ వాసులేనని ప్రాథమికంగా గుర్తించారు. నిందితులు ఆరుగురికి 41(ఎ) నోటీసులు జారీ చేశారు. యూట్యూబ్ నుంచి వివరాల కోసం వేచి చూస్తున్నారు. వివరాలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైం అదనపు డీసీసీ రఘువీర్ తెలిపారు.

Related posts