telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌..

ys jagan cm

సీపీఎస్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై సీఎం జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎస్‌ సంబంధించిన పూర్తి సమాచారాన్ని భేటీలో అధికారులు వివరించారు. సీపీఎస్‌పై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఇచ్చిన నివేదిక సహా టక్కర్ కమిటీ నివేదికను కూడా పరిశీలించామన్న అధికారులు…రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో 1,98,221 మంది సీపీఎస్‌లో ఉన్నారని అధికారుల వెల్లడించారు. నేరుగా ప్రభుత్వోద్యోగులు 1,78,705 కాగా, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద 3,295 మంది ఉండగా మిగిలిన 16,221 మంది యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో పని చేస్తున్నారని సీఎస్ వివరించారు. ఏ పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తే ఎంత వ్యయం అవుతుందనే అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. ఆర్టీసీకు చెందిన దాదాపు 52 వేల మంది ఉద్యోగులను కూడా ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేర్చి, సమగ్ర నివేదిక సిద్దం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసి, వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయలేదని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వ జీవోలను అమలు చేశామని పేర్కొన్నారు సీఎం జగన్‌. మినిమమ్‌ టైమ్‌ స్కేల్ (ఎంటీఎస్‌) కూడా అమలు చేశామని…కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయం న్యాయపరమైన అంశాలతో ముడి పడి ఉందన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చేందుకు విధి విధానాలు రూపొందించాలన్నారు.

Related posts