telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టీడీపీలో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ వర్గ విభేదాలు : కన్నీళ్లు పెట్టుకున్న బుద్దా వెంకన్న

బెజ‌వాడ టీడీపీలో వర్గ విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి . టీడీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం ర‌ఘురామ్ తో పాటు కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షుడు కొన‌క‌ళ్ల నారాయ‌ణ హాజ‌ర‌య్యారు.

అయితే ఎంపీ కేశినేని నాని కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఢిల్లీలో స‌మావేశాలు ఉన్నందున హాజ‌రు కాలేద‌ని పార్టీ నేత‌లు వేదిక‌పైనే ప్రకటించారు.

మ‌రో వైపున పార్టీ విస్తృత స్థాయి స‌మావేశానికి హాజ‌రైన టీడీపీ నేత‌లు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న, టీడీపీ రాష్ట్ర కార్యద‌ర్శి నాగుల్ మీరా ఇద్దరు బ‌హిరంగంగానే త‌మ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

స‌మావేశానికి సంబంధించిన స‌మాచారాన్ని త‌మ‌కు ఆల‌స్యంగా తెలియ చేయ‌టంతో పాటు, తాము రాకుండానే స‌మావేశాన్ని ప్రారంభించార‌ని వేదికపై ఏర్పాటు చేసిన బ్యాన‌ర్ లో తమ ఫోటోలు ఫ్లెక్సీపై ఉంచకపోవడంతో ఆయన ఆగ్రహించారు.

అనంతరం ఆయన కన్నీళ్లు పెట్టుకుని వెళ్లిపోయారు. వేదిక మీదకు రావాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బుద్దా వెంకన్నను పదే పదే కోరినా ఆయన కిందనే కాసేపు కూర్చుని సమావేశం మధ్య నుంచి వెళ్లిపోయారు.

పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బతిమ‌లాడినా ఆయన వినకుండా వెళ్లిపోయారు. కాసేపు ఉన్న తర్వాత సమావేశం నుంచి బుద్దా వెంకన్నతో పాటు నాగుల్ మీరా కూడా వెళ్లిపోయారు. ఇక ఈ సమావేశంలో గద్దె రామ్మోహన్ ను వేదికపైకి ఆహ్వాినించలేదంటూ ఆయన అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు

Related posts