telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జగన్ పై దాడి కేసు..ముగిసిన ఎన్ఐఏ కస్టడీ

YS Jagan Case transfer to NIA
వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో అధికారులు అతడిని ఈరోజు  విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. జగన్ పై అతను కావాలనే దాడి చేశాడా? లేక ఈ దాడి వెనుక మరెవరైనా ఉన్నారా? అన్న విషయంలో ఈరోజు స్పష్టత రానుంది. 
మరోవైపు ఈ కేసులో ఎన్ఐఏ, సిట్ అధికారుల మధ్య వివాదం తేలేవరకూ విచారణను నిలిపివేయాలని న్యాయవాది సలీం కోర్టును కోరారు.
మరోవైపు ఈ కేసులో ఎన్ఐఏ, సిట్ అధికారుల మధ్య వివాదం తేలేవరకూ విచారణను నిలిపివేయాలని నిందితుడి తరఫు న్యాయవాది సలీం కోర్టును కోరారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు కోడికత్తితో జగన్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే.

Related posts