వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో అధికారులు అతడిని ఈరోజు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. జగన్ పై అతను కావాలనే దాడి చేశాడా? లేక ఈ దాడి వెనుక మరెవరైనా ఉన్నారా? అన్న విషయంలో ఈరోజు స్పష్టత రానుంది.
మరోవైపు ఈ కేసులో ఎన్ఐఏ, సిట్ అధికారుల మధ్య వివాదం తేలేవరకూ విచారణను నిలిపివేయాలని న్యాయవాది సలీం కోర్టును కోరారు.
మరోవైపు ఈ కేసులో ఎన్ఐఏ, సిట్ అధికారుల మధ్య వివాదం తేలేవరకూ విచారణను నిలిపివేయాలని నిందితుడి తరఫు న్యాయవాది సలీం కోర్టును కోరారు. గతేడాది అక్టోబర్ 25న విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు కోడికత్తితో జగన్ పై దాడిచేసిన సంగతి తెలిసిందే.