మాజీ మంత్రి కొడాలి నాని గత కొంతకాలంగా టీడీపీ నాయకులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. టీడీపీ అంటేనే ఒంటి కాలిపై లేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం విజయవాడలో నిర్వహించారు..టీడీపీ నేతలు ముఖ్యంగా ముగ్గురు వైసీపీ నాయకులు పైనే తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు విజయవాడ తూర్పు వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పై విమర్శలు గుప్పించారు. ప్రధానంగా కొడాలి నాని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, రాజకీయంగా ఎలాంటి కామెంట్స్ అయినా తాము రిసీవ్ చేసుకుంటామన్నారు.
వ్యక్తిగతంగా ఇంట్లో మహిళలను కూడా రాజకీయాల్లోకి లాగి జుగుత్సాహకరంగా వ్యాఖ్యలు చేయటంపై అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకుని కొడాలి నాని, వల్లభనేని వంశీ డీఎన్ఎ టెస్ట్ చేయించాలని టీడీపీ నేత బాబు రాజేంద్రప్రసాద్ ఫైర్ అయ్యారు.
ఎవరైనా తండ్రి వద్ద తెచ్చుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకుంటారని, మరి చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకువెళ్లిన వారిని ఏమనాలని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న త్రీ ఇడియట్స్ కు త్వరలోనే బుద్ది చెబుతామని హెచ్చరించారు
జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు: యనమల