telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బీజేపీపై స‌జ్జ‌ల మాట‌ల తూటాలు..

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బిజెపిపై వైఎస్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బిజెపి నేత‌లు అబ‌ద్దాల‌ను ప్ర‌చారం చేస్తూ, ప‌బ్బం గ‌డుపుతున్నార‌ని ఆరోపించారు.

ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న‌లో ఏదైనా అవాస్త‌వం ఉందా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. దీనిపై బిజెపి నేత‌లు స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. పెట్రోల్‌, డిజీల్ విష‌యంలో కేంద్రం 3కోట్ల 20 ల‌క్ష‌ల రూపాయ‌లు త‌మ కోటాలో వేసుకుంద‌ని విమ‌ర్శించారు.

ఆ మొత్తాన్ని న‌గ‌దు కూడా అన్ని రాష్ట్రాల‌కు స‌మానంగా పంపిణీ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. అంత మొతంలో కేంద్రం త‌గ్గిస్తే, దాని ప్ర‌కారం రాష్ట్రాల్లో కూడా త‌గ్గు తుంద‌న్నారు. కేంద్రం నామమాత్రంగా తగ్గించి.. పూర్తి స్థాయిలో రాష్ట్రాలు తగ్గించాలంటే ఎలా ? అని స‌జ్జ‌ల‌ అన్నారు.

Related posts