ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రకటించింది. సెప్టంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక క్రిస్టియన్, మైనారిటీ పాఠశాలలకు మాత్రం అక్టోబర్ 1 నుంచి 6 వరకు సెలవులు ప్రకటించింది. 7వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.ఈ విద్యాసంవత్సంలో పాఠశాలకు 220 పనిదినాలు, 80 సెలవుదినాలుగా ప్రభుత్వం పేర్కొంది.