ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. నేటి ఉదయం 10:25 నిమిషాలకు ఏపీ సీఎం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11:05 నిమిషాలకు విశాఖకు చేరుకుంటారు. అక్కడినుంచి దాదాపు 12 గంటలకు రుషికొండ పెమ వెల్నెస్ రిసార్ట్కు చేరుకుంటారు.
ఏపీలో పర్యటిస్తున్న హర్యానా సీఎం ఖట్టర్తో వైఎస్ జగన్ భేటీ అవుతారు. మనోహర్ ఖట్టర్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీకి సన్నిహితమైన నేత..ఆయన విశాఖలో ప్రస్తుతం నేచురోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆయన్ను జగన్ కలుస్తున్నారంటే.. రాజకీయంగా ఏదో కారణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎంతో భేటీ అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖ నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి ఏపీ సీఎం జగన్ చేరుకోనున్నారు.