టీడీపీకి రాజీనామా సమర్పించిన నామా నాగేశ్వరరావు గురువారం టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన కారెక్కరు. ఈ సందర్భంగా నామాకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. నామాతో పాటు టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణ కుమారి, అమర్ నాథ్, ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, మంచిర్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు శరత్ బాబు టీఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ తో పాలు పలువురు నేతలు పాల్గొన్నారు. మరోవైపు నామా ఖమ్మం పార్లమెంట్ నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.