కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో లాక్డౌన్ను ప్రజలందరూ పాటించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. ఇలాంటి సమయంలో వైసీపీ రాజకీయ విమర్శలు చేస్తోందని, రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని చంద్రబాబు హితవు పలికారు.
ఈ మహమ్మారి కారణంగా వ్యవసాయ ఉత్పత్తి రంగాలు దెబ్బతింటున్నాయన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. నిత్యావసరాల వస్తువుల ధరలను అదుపు చేయాలని సూచించారు. ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం సాయం చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో మహిళల పట్ల చులకనభావం పోవాలి: కోదండరాం