దేశ పౌరులంతా కరోనాను తరిమికొట్టేందుకు రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు ఇంట్లోని విద్యుత్ లైట్లు అన్నీ ఆఫ్ చేసి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ స్ఫూర్తిని చాటాలని టీమిండియా సారథి విరాట్ కోహ్లీ పిలుపునిచ్చాడు.
‘అభిమానుల్లోని పవరే స్టేడియంలోని పవర్. అలాగే, దేశ ప్రజల్లోని స్ఫూర్తే భారత స్ఫూర్తి. ఈ రోజు రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని మన దేశ ప్రజలమంతా ఒకటిగా నిలబడతామని ప్రపంచానికి చాటుదాం. అలాగే, వైద్య సిబ్బందికి మద్దతుగా మనం ఉన్నామని చాటి చెబుదామని ఆయన ట్వీట్ చేశాడు.
” అమ్మ ఒడి” ని ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం: రోజా