telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పత్రికా స్వేచ్ఛను కాపాడే వరకు తమ పోరాటం: చంద్రబాబు

chandrababu

పత్రికా స్వేచ్ఛను కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ ప్రసారాలు చేయకుండా కొన్ని ఛానెళ్లను అడ్డుకోవడం దారుణమంటూ చంద్రబాబు నేతృత్వంలో అమరావతిలోని సచివాలయం ఫైర్ స్టేషన్ ఎదుట ఈ రోజు టీడీపీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ప్రభుత్వం వెంటనే 2430 జీవోను రద్దు చేసి, నిషేధాన్ని ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియాకు సంకెళ్లు వేసి ఈ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తిస్తోందన్నారు. 2430 జీవో తీసుకొచ్చి బెదిరించడం దుర్మార్గమని అన్నారు. ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఎవరూ నాశనం చేయలేరని అన్నారు.

Related posts