telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మెగా ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు…

Mega-Family

డిసెంబర్ 25 నేడు దేశ వ్యాప్తంగా ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్‌ దీపాకాంతులతో ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్‌ శోభ వెల్లివిరుస్తోంది. టాలీవుడ్ లోను సంబరాలు నిన్నటి నుండే మొదలైయాయి. నటీనటులందరూ కూడా విషెస్ చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీ సందడి కనిపించింది.  అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, రాంచరణ్, ఉపాసన, సాయిధ‌ర‌మ్ తేజ్, వ‌రుణ్ తేజ్, నిహారిక‌, చైత‌న్య‌, శిరీష్ , సుస్మిత‌, శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ త‌దిత‌రులు ఈ పార్టీలో సంద‌డి చేయ‌గా,అందుకు సంబంధించిన ఫొటోని శిరీష్ త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేస్తూ అంద‌రికి క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు మెగాస్టార్‌ చిరంజీవి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘క్రిస్మస్‌ పండుగ శుభాకాంక్షలు. క్రిస్మస్‌ మ్యాజిక్‌‌ మన జీవితాల్లో ఆనందాన్ని, చిరునవ్వును నింపుతుందని ఆశిద్దాం. ఈ పండుగ హాలీడే సీజన్‌ మీలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని కోరుకుంటున్నా’. అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Related posts