telugu navyamedia
రాజకీయ వార్తలు

యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు!

yogi adityanath

అత్యాచారం కేసుల సత్వర పరిష్కారానికి యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 218 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఈ మేరకు యూపీ మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయదలచిన ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో 113 మహిళల కేసుల పరిష్కారానికి, 74 బాలికల కేసుల విచారణకు పనిచేయనున్నట్టు యూపీ న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు.

ఒక్కో కోర్టుకు రూ.75 లక్షలు వెచ్చించనున్నట్టు పేర్కొన్నారు.అయోధ్య, గోరఖ్‌పూర్, ఫిరోజాబాద్‌నగర్ నిగంతోపాటు 41 గ్రామాలను విలీనంతోపాటు గౌతంబుద్ధనగర్ జిల్లాలోని జేవర్ ప్రాంతంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదనకు యూపీ మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది.

Related posts