హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో 1.7 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు దిగి, అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఓ వ్యక్తిని ఇంటలిజెన్స్, డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. అతని వద్ద 1.7 కేజీల విదేశీ ముద్ర గల బంగారం లభ్యమైంది. బంగారం విలువ 66 లక్షల 64వేల రూపాయలు ఉంటుందని అధికారులు తెలియజేశారు. ఈ బంగారానికి సంబంధించి అతడి వద్ద ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేనందున అది అక్రమ బంగారంగా అధికారులు తేల్చారు. ఆ వ్యక్తిని అధికారులు, అదుపులోకి తీసుకోనున్నారు.