telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజ్‌నాథ్‌ సింగ్‌తో రఘురామకృష్ణంరాజు భేటీ!

raghauramakrishnam raju mp

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఢిల్లీలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. ఆయన నిన్న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను, ఎన్నికల కమిషన్‌ అధికారులను కలిశారు. బీజేపీ నేతలతో చర్చలు జరుపుతూ గతంలోనూ ఆయన చాలా సార్లు వార్తల్లోకెక్కారు. రాజ్‌నాథ్‌తో ఆయన షోకాజ్‌ నోటీసుపై చర్చిస్తున్నారు.తనకు వైసీపీ జారీ చేసిన షోకాజు నోటీసు చెల్లుబాటు కాదని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదైన వైసీపీ అసలు పేరు, తనకు షోకాజు నోటీసుల్లో ఉన్న పార్టీ పేరు మధ్య కూడా వ్యత్యాసంపై ఉన్నట్లు ఆయన నిన్న ఈసీకి కూడా వివరించారు. తమ పార్టీలో క్రమశిక్షణ కమిటీ లేదని చెప్పారు. తనపై చర్యలు ఎలా తీసుకుంటారాని ఆయన వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ నేతలను కూడా కలుస్తుండడం ఆసక్తి రేపుతోంది.

Related posts