telugu navyamedia
రాజకీయ వార్తలు

రాహుల్‌ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

smruthi irani

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికలసంఘానికి ఫిర్యాదు చేశామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. మేకిన్‌ ఇండియా కాదు. రేప్‌ ఇన్‌ ఇండియా అని రాహుల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీజేపీ మహిళా ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలించి.. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని, న్యాయం జరిగేలా చూస్తామని ఎన్నికల కమిషన్‌ హామీ ఇచ్చిందని స్మృతి ఇరానీ తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను రాజకీయంగా వాడుకోవద్దని గతంలోనే తాము చెప్పామని స్మృతి ఇరానీ గుర్తు చేశారు. రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను కోరామని తెలిపారు.

Related posts