telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విత్త‌న కంపెనీ ప్ర‌తినిధుల‌కు ప్ర‌భుత్వం స‌హ‌కారం: హ‌రీష్‌రావు

Harish Rao trs

విత్త‌న కంపెనీల ప్ర‌తినిధుల‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హ‌కారం ఉంటుంద‌ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో విత్త‌న కంపెనీల ప్ర‌తినిధుల‌తో బుధ‌వారం మంత్రి స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాను విత్త‌నోత్ప‌త్తి కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామ‌న్నారు.

విత్త‌నోత్ప‌త్తికి సిద్దిపేట జిల్లా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. విత్త‌నోత్ప‌త్తి సాగు వ‌ల్ల కంపెనీలు, రైతులు ఇద్ద‌రికీ లాభ‌మే చేకూరుతుంద‌ని తెలిపారు. రైతు ఆదాయం రెట్టింపు చేయాల‌నేదే త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి హ‌రీష్‌రావు అన్నారు.

Related posts