telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

స్కూల్ బస్సులో మంటలు.. విద్యార్థులకు తప్పిన ప్రమాదం

Bus fire kurnul

స్కూల్ బస్సు లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు అప్రమత్తమై బస్సు నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని నిర్మలగిరి పాఠశాలకు చెందిన బస్సు 25 మంది విద్యార్థులతో చాగల్లు బయలు దేరింది.మీనా నగరం సమీపం నుంచి బస్సు ప్రయాణిస్తున్న క్రమంలో బస్సు ఇంజన్ లోంచి అకస్మాత్తుగా మంటలు వచ్చాయి.

దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కగా ఆపి విద్యార్థులను కిందకు దించివేశాడు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు రేగాయని తెలుస్తోంది. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

Related posts