దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం లక్ష్మీఎస్ ఎన్టీఆర్ చిత్రం ఏపీ ఎన్నికల పై ప్రభావం చూపించే అవకాశం ఉందని ఈ సినీమా విడుదలను ఏపీలో నిలిపివేశారు. హైకోర్టు స్టే విధించటంతో ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాలేదు. కాగాతెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో సినిమా విడుదలై ఆయా సినీమా హాళ్లలో ఆడుతుంది.
రాజమండ్రిలో సినిమా విడుదల కాకపోవడంతో.. హైదరాబాద్ వచ్చి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వీక్షించారు. ఈ సినిమాకు గీత రచయితగా పనిచేసిన సిరా శ్రీ, ఎమెస్కో అధినేత విజయ్ కుమార్లతో కలిసి అరుణ్ కుమార్ సినిమా చూశారు. ఈ విషయాన్ని సిరాశ్రీ తన ట్విటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.