telugu navyamedia
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న “విశ్వామిత్ర”

Viswamitra

ఫణి తిరుమలశెట్టి సమర్పణలో రాజకిరణ్ సినిమా పతాకంపై మాధవి అద్దంకి, రజనీకాంత్ ఎస్, రాజకిరణ్ నిర్మిస్తున్న సినిమా “విశ్వామిత్ర”. నందితారాజ్, ‘సత్యం’ రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజకిరణ్ దర్శకత్వం వహించారు. తాజాగా విశ్వామిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు విశ్వామిత్ర చిత్రానికి “యూఏ” సర్టిఫికెట్ జారీ చేశారు. సెన్సార్ సభ్యుల నుంచి విశ్వామిత్ర చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చిందని, వారి స్పందన చూశాక విశ్వామిత్ర చిత్రం కోసం తాము ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని మరచిపోగలిగామని దర్శకుడు రాజ్ కిరణ్ అన్నారు.

సృష్టిలో ఏది జరుగుతుందో… ఏది జరగదో!? చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంతకాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే మా ‘విశ్వామిత్ర’ చిత్రకథ అని, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన థ్రిల్లర్  చిత్రకథను న్యూజీలాండ్‌, అమెరికాలో నిజంగా జరిగిన కథలపై పరిశోధన చేసి రాసుకున్నా. నందితారాజ్ మధ్యతరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తారు అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts