జాతీయ రహదారి భద్రత మాసోత్సవ సందర్బంగా నేడు ప్రత్యేక కార్యక్రమం జరుగింది. ఈ కార్యక్రమం సైబరాబాద్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం కూడా జరగుతోంది. ఈ కార్యక్రమానికి రైల్వీస్ అడిషనల్ డీజీ సందీప్ శాండిల్య, సీపీ సజ్జనార్, ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇందులో సినీ నటుడు ఎన్టీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్రోలింగ్ వాహనాలను జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభించారు. ఆ వాహనాలను ఎన్టీఆర్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. కాగా…ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఓ చిన్న షెడ్యూల్ ను మహారాష్ట్రంలోని మహాబలేశ్వరం వద్ద ప్లాన్ చేశారు. ఇక్కడి ప్రకృతి అందాల మధ్య కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.
previous post
next post