పుల్వామా ఘటన తరువాత కూడా ఉగ్రమూక వెనక్కి తగ్గకపోగా ఇంకా ప్రతీకార దాడులకు సమయం వచ్చినప్పుడల్లా ప్రయత్నిస్తూనే ఉన్నారు. జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ఇవాళ ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
అనంత్నాగ్లోని కోకర్నాగ్ ఏరియాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని బలగాలకు సమాచారం అందింది. దీనితో అక్కడికి చేరుకున్న బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కోసం బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.
Jammu And Kashmir: A brief exchange of fire occurred late night between terrorists and security forces in Anantnag district’s Kokarnag area. Area is under cordon. (visuals deferred by unspecified time) pic.twitter.com/q2aU5MYEg2
— ANI (@ANI) March 30, 2019
త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘానికి ఈ పరిస్థితులు ఆటంకం అవనున్నాయా.. అసలు ఉగ్రమూకలు రాష్ట్రంలో ఎన్నికలను సజావుగా జరగనిస్తాయా.. అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం. ఈ దాడులతో ప్రాంతీయ ప్రజలు ఒకపక్క సరిహద్దులలో పాక్ కాల్పుల విరమణలతో, మరోవైపు ఉగ్రదాడులతో అనుక్షణం భయాందోళనలోనే కాలం గడుపుతుండటం .. అక్కడి ప్రజల మనసులలో ఈ పరిస్థితులతో వ్యతిరేకత ఏర్పడే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి.