telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు విద్యార్ధులను రాష్ట్రానికి రప్పించాలి: చంద్రబాబు

chandrababu

ఢిల్లీలో క్వారంటైన్ పూర్తయిన తెలుగు విద్యార్ధులను రాష్ట్రానికి రప్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టం, నష్టం పంచుకోవాలని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ అశ్రద్ధ, నిర్లక్ష్యం వల్లే కరోనా పెరిగిందని చంద్రబాబుతో నేతలు చెప్పారు. వసతులు లేక క్వారంటైన్ కేంద్రాల్లో ఉండేందుకు ప్రజలు ఇష్టపడటం లేదని వివిధ జిల్లాల టీడీపీ నేతలు అధినేతకు తెలియజేశారు. ఉపాధి పోయిన పేద కుటుంబాలను ఆదుకోవాలని, కోడిగుడ్లు, కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ చేయాలని బాబు డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు.

Related posts