telugu navyamedia
రాజకీయ వార్తలు

తన మౌనాన్ని బలహీనతగా తీసుకోవద్దు: ఉద్ధవ్ థాకరే

uddhav-thackeray-shivasena

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు, అధికార శివసేన నేతలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో  కంగనా రనౌత్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. రనౌత్ వ్యాఖ్యలపై తాజాగా సీఎం ఉద్ధవ్ థాకరే స్పందించారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కరోనా కట్టడిపైనే ఉందని తెలిపారు. 

తగిన సమయంలో స్పందిస్తానని అన్నారు. తన మౌనాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ బలహీనతగా తీసుకోవద్దని హెచ్చరించారు. మహారాష్ట్రను అప్రదిష్ఠ పాల్జేసేందుకు కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

మహారాష్ట్రకు చెడ్డపేరు తెచ్చేందుకు రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రస్తుతం వీటిపై తాను స్పందించాలనుకోవడంలేదని తెలిపారు. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక, ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పక్కనబెట్టి స్పందిస్తానని తెలిపారు.

Related posts