నిన్నటి వరకు విపరీతంగా పెట్టిన చలితో ప్రజలు వణికిపోయారు. ప్రస్తుతం చలికాలం కావడంతో.. ఆ వాతావరణానికే ప్రజలకు అలవాటై పోయారు. అయితే.. నిన్న రాత్రి ఒక్కసారిగా వర్షం పడింది. దీంతో వాతావారణం పూర్తిగా మారిపోయింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు తేలిక పాటి వర్షాలు కురిశాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, యాదాద్రి, హైదరాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిన్నటి రాత్రి వర్షం కురిసింది. అయితే.. ఇవాళ, రేపు కూడా తెలంగాణలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ పేర్కొంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువొచ్చని తెలిపారు టీఎస్డీపీఎస్. మరోవైపు వాతావరణంలో మార్పుల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా చలిగాలులు వీస్తున్నాయి. ఇక విదర్భ, మహారాష్ట్ర వైపు నుంచి వీస్తున్న చలిగాలులు హైదరాబాద్ ప్రజలకు వణికిస్తున్నాయి.
previous post
ఓడిపోయిన చోట పవన్ మొహం చూపించలేదు: అంబటి