telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నేడు .. అంబేడ్కర్‌వాదుల మహాగర్జన సభ.. ఈసీ అనుమతి ఉందా..!

MRPS manda krishna comments Chandrababu

నేడు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ‘అంబేడ్కర్‌వాదుల మహాగర్జన సభ’ జరగనుంది. పంజాగుట్టలోని అంబేడ్కర్‌ విగ్రహాన్ని అవమానించినందుకు, అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనక పోవటాన్ని నిరసిస్తూ ధర్నాచౌక్‌ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఈ సభను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, వివిధ పార్టీల నేతలను ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు.

సభాస్థలాన్ని మందకృష్ణ మంగళవారం సందర్శించారు. టీఆర్‌ఎ్‌సయేతర పార్టీల అగ్రనేతలు పాల్గొనే ఈ సభకు వేలాది మంది హాజరవుతారని, భారీ ఎత్తున నిర్వహించేందుకు సహకరించాలని పోలీసులను కోరారు. సభను ఒక మూలకు నిర్వహించాలని పోలీసులు అంటున్నారని, అలా అయితే వేలాదిగా వచ్చే అంబేడ్కర్‌వాదులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.

Related posts