నేడు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ‘అంబేడ్కర్వాదుల మహాగర్జన సభ’ జరగనుంది. పంజాగుట్టలోని అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానించినందుకు, అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొనక పోవటాన్ని నిరసిస్తూ ధర్నాచౌక్ వద్ద మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే ఈ సభను జయప్రదం చేయాలని అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, వివిధ పార్టీల నేతలను ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు.
సభాస్థలాన్ని మందకృష్ణ మంగళవారం సందర్శించారు. టీఆర్ఎ్సయేతర పార్టీల అగ్రనేతలు పాల్గొనే ఈ సభకు వేలాది మంది హాజరవుతారని, భారీ ఎత్తున నిర్వహించేందుకు సహకరించాలని పోలీసులను కోరారు. సభను ఒక మూలకు నిర్వహించాలని పోలీసులు అంటున్నారని, అలా అయితే వేలాదిగా వచ్చే అంబేడ్కర్వాదులకు ఇబ్బంది కలుగుతుందన్నారు.