ఏపీ రాజధాని పై మంత్రి బొత్స సత్యనారాయణ మరో షాకిచ్చారు. రాజధాని పై స్పష్టత కోసం కమిటీ వేశామని ఆయన తెలిపారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. అమరావతిలో నిర్మాణ దశలో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారని. నిన్నటి పరిస్థితిని బట్టే అమరావతే రాజధాని అని చెప్పానని బొత్స వివరణ ఇచ్చారు.
అమరావతి రైతులను పూర్తిగా ఆదుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని బొత్స ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా కొనసాగకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టుపై మళ్లీ టెండరింగ్ కు వెళ్లే అంశంపై ఆలోచిస్తున్నామని అన్నారు.