telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఇటీవలే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఇద్దరు శాసనసభ్యులకు భద్రత పెంచారు. తాండూరు, కొల్లాపూర్ ఎమ్మెల్యేలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ శాసనసభ్యుడు హర్షవర్ధన్ రెడ్డిలపై వారి నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.

ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. తమకు ప్రస్తుతం ఉన్న భద్రత సరిపోదని తెలిపారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ సర్కారు ఇద్దరు ఎమ్మెల్యేలకు అదనంగా మరికొంతమంది గన్ మెన్ లను కేటాయించింది. కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి టీఆర్ఎస్ లో చేరడంతో వారి నియోజకవర్గాల్లో కొందరు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అధనపు భద్రత కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Related posts