మనదేశంలో మైనర్లను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన నిందితులు దొరికితే ఏం చేస్తారు ? అరెస్ట్, కేసులు, కోర్టులు అంటూ తిరిగి చివరకు బెయిల్ తో బయటకు వస్తారు నిందితులు. కానీ సాధారణ ప్రజలు మాత్రం అలాంటి ఉరి తియ్యాలని గట్టిగా మనసులో అనుకుంటాము. అయితే అది మనదేశంలో జరగదు. కానీ సౌదీలో జరుగుతుంది. ఇప్పటికే ఇలాంటి ఘటనల్లో చాలామందికి ఉరి శిక్ష పడింది కూడా. తాజాగా సౌదీలోని రియాద్ లో గురువారం ఇద్దరు అరబ్ వ్యక్తులకు అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు. మైనర్లను అపహరించి వారిపై అఘాయిత్యానికి పాల్పడడంతో నిందితులకు న్యాయస్థానం ఉరిశిక్ష వేసింది. రియాద్లో గత కొంతకాలంగా పలువురు మైనర్లను కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారానికి పాల్పడిన ఫహద్ అల్ కత్రే (సౌదీ వాసి), మహ్మద్ అల్ అఖీల్ (యెమన్ వాసి)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని క్రిమినల్ కోర్టులో హాజరుపరిచారు. తమ నేరాన్ని అంగీకరించిన వారిద్దరికి మరణ శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో సౌదీ అధికారులు గురువారం ఉయదం ఫహద్ అల్ కత్రే, మహ్మద్ అల్ అఖీల్లకు ఉరిశిక్షను అమలు చేశారు.
జగన్ ప్రజల ఆరోగ్యాన్ని రిస్క్లో పెడుతున్నారు: చంద్రబాబు