telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భయపెట్టాలని చూస్తే ఊరుకోం.. వైసీపీ నేతల పై చంద్రబాబు ఫైర్

chandrababu gift on may day

వైసీపీ నేతల పై టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ తమ రౌడీయిజాన్ని పులివెందులలో చూపించుకోవాలన్నారు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తే ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు. ఇలా అయితే భవిష్యత్‌లో రాష్ట్రం అనాధగా మారిపోతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి రోజూ అత్యాచారాలు జరుగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు.

వైసీపీ నేతలు విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని, చిరు ఉద్యోగులపైనా దాడులు చేస్తున్నారని ధర్మవరంలో చేనేత కార్మికుడిని దారుణంగా చంపేశారన్నారు. వైసీపీ కార్యకర్తలు ఫిరంగిపురం సమీపంలోని గ్రామంలో దారికడ్డంగా కాంపౌండ్ వాల్ కట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సాక్షాత్తు ఓ మంత్రి నియోజకవర్గంలో ఒక మండలమన్నారు. వైసీపీ దౌర్జన్యాలకు ఇది పరాకాష్టన్నారు. దీనికి మంత్రి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇదే విషయం టీడీపీ ఎమ్మెల్యేలు సభలో ప్రశ్నించారని, దీనికి మంత్రి సమాధానం చెప్పలేదని విమర్శించారు. చట్టం ముందు అందరూ సమానులే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.

Related posts