telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బాబ్రీ మసీదును కూల్చివేత ఘటనపై విచారణ జరపాలి: అక్బరుద్దీని ఒవైసీ

Akbaruddin mim

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ బాబ్రీ మసీదును కూల్చివేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహిదీపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేసిన వారిని జైలుకు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు. మసీదు కూల్చివేత ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయోధ్య స్థల వివాదం అంశంపై సుప్రీంకోర్టు తీర్పులు సమీక్షించాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయోధ్యలో మసీదు నిర్మాణానికి వేరే చోట ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలనే సుప్రీంకోర్టు నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని అన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని కోరుతూ డిసెంబర్ 6న శాంతియుత పద్ధతిలో నిరసనలు తెలపాలని పేర్కొన్నారు.

Related posts