telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రైవేటు ఆసుపత్రులు తమ తీరు మార్చుకోలి: ఈటల హెచ్చరిక

Etala Rajender

ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రులపై వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో నిన్న మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని, లేదంటే 50 శాతం పడకలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.

కొవిడ్ చికిత్సకు అధిక బిల్లుల వసూళ్లపై ఇప్పటి వరకు 1039 ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. ఫిర్యాదులు వచ్చిన ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు.

Related posts