telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రగతి భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపు.. రేవంత్, షబ్బీర్ అలీ హౌస్ అరెస్ట్

revanth shabbir ali

ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముందస్తుగా కాంగ్రెస​ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు షబ్బీర్‌ అలీ, పొన్నం ప్రభాకర్‌, కొండా విశ్వేశ్వర్‌ రెడ్డితో పాటు పలువరు నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

వరంగల్‌లో డీసీసీ చీఫ్ నాయిని రాజేందర్‌రెడ్డికి గృహ నిర్బంధం విధించారు. అలాగే, వర్ధన్నపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, ఎల్బీనగర్‌లలో కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ ముట్టడికి తరలి వస్తున్న జగిత్యాల, సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అలాగే ప్రగతి భవన్‌ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Related posts