telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నిశ్శబ్దం” ముందుగా అనుష్క కోసం కాదు… ఆ స్టార్ హీరోయిన్ కోసమేనట…!?

Silence

హేమంత్ మధుకర్ దర్శక‌త్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మ‌ల‌యాళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలినీ పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌, హంట‌ర్ ఓ హ‌రో కూడా నటిస్తున్నారు. అనుష్క నటిస్తోన్న “నిశ్శబ్ధం” చిత్రాన్ని మిగతా భాషల్లో “సైలెన్స్” పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడ‌లేని సాక్షి అనే అమ్మాయి పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా “నిశ్శబ్ధం” సినిమాను జనవరి 31, 2020 విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

ఇటీవల ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నిర్మాత, రచయిత కోన వెంకట్ ఈ సినిమాలో అనుష్క పోషిస్తున్న సాక్షి పాత్రకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్‌ ఒకటి చెప్పాడు. “ఈ పాత్ర అనుష్కను దృష్టి పెట్టుకొని రాయలేదు. ఓ స్టార్‌ హీరోయిన్‌ కోసం ఈ పాత్రను తయారు చేశాను. అయితే ఓ రోజు ఫ్లైట్‌లో అనుష్క కలిసినప్పుడు క్యాజువల్‌గా కథ వినిపించాను. అనుష్క ఓకే చెప్పటంతో ఈ సినిమా ప్రాజెక్ట్‌లోకి ఆమె వచ్చింది”. అంటూ అసలు విషయాన్ని రివీల్‌ చేశాడు. అయితే ఈ కథను ఏ హీరోయిన్‌ కోసం తయారు చేశారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

Related posts