telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పాలకులు సహృదయంతో స్పందించాలి: పవన్‌

pawan

ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడ నిత్యం భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ స్పందించారు. కరోనా వల్ల అన్ని వర్గాలు ఇబ్బందులు పాలవుతున్నారని ఆయన అన్నారు. ఇలాంటి తరుణంలో పాలకులు సహృదయంతో స్పందించాలని కోరారు.

ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగిస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లా నేస్తం నిధులు నిలిపివేయడం సమంజసం కాదన్నారు. న్యాయవాదుల సంక్షేమంకు రూ.100 కోట్లు ఇస్తామని జీవో ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని పవన్‌ ఆరోపించారు.

Related posts