బీహార్ ఫలితాలు ఎగ్జిట్ పోలింగ్ కు పూర్తిగా భిన్నంగా వస్తున్నాయి. అనూహ్యంగా అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. దీంతో బీహార్ తదుపరి సీఎంగా నితీశ్ కుమారే కొనసాగుతారా? లేక బీజేపీ కొత్త అభ్యర్థిని బీజేపీ రంగంలోకి దింపనుందా? అన్నది ఆసక్తిదాయకంగా మారింది. అయితే…దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ వర్గీయ మాట్లాడుతూ…”ఈ ఎన్నికల్లో మోడీ ప్రభావమే మమ్మల్ని విజయతీరాలకు చేర్చింది.” ప్రభుత్వ ఏర్పాటుపై సాయంత్రం కల్లా నిర్ణయం తీసుకుంటాం. నాయకత్వంపై కూడా సాయంత్రం కల్లా నిర్ణయం తీసుకుంటాం. నితీశ్నే తదుపరి సీఎంగా ఎంపిక చేస్తాం.” అని కైలాస్ విజయ వర్గీయ ప్రకటించారు. అయితే..నాయకత్వంపై కూడా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన నేపథ్యంలో..బీజేపీ వేస్తున్న వ్యూహంపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ సొంతంగానే 74 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే జేడియూ మాత్రం కేవలం 48 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. దీంతో నితీశ్ కుమార్ పై అందరి చూపు పడింది. అయితే…దీనిపై క్లారిటీ రావాలంటే పూర్తి ఫలితాలు వచ్చే వరకు చూడాలి.
previous post