telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

విదేశాల నుంచి వచ్చినవాళ్లే కరోనా బాధితులు: మంత్రి ఈటల

Etala Rajender

విదేశాల నుంచి వచ్చినవాళ్లే కరోనా బాధితులయ్యారని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. కరోనా వైరస్ ఎదుర్కోవడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఐఎంఏ తదితర వైద్యసంఘాల ప్రతినిధులతోహైదరాబాద్ కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూంలో సమావేశం నిర్వహించారు.

అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ కరోనాపై తెలంగాణ తీసుకుంటున్న చర్యలను కేంద్రం కూడా అభినందించిందని తెలిపారు. రాష్ట్రంలోని వారికి ఎవరికీ కరోనా లేదని,.ఇప్పటివరకు 18 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని అన్నారు. అత్యవసర పరిస్థితులకు దారితీస్తే, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉంచి చికిత్స అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

Related posts