telugu navyamedia
రాజకీయ వార్తలు

ఉగ్రవాద చర్యలపై కఠినంగా వ్య్వహరిస్తాం: మోదీ

modi on telugu states separation

ఉగ్రవాద చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం అనంత్‌నాగ్‌ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గుల్‌ మహ్మద్ మిర్‌ను శనివారం ఆయన ఇంటివద్దే ముష్కరులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మోదీ తీవ్రంగా స్పందించారు .దేశంలో ఉగ్రవాదానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వమని ఆయన స్పష్టం చేశారు.

అమానుష చర్యలతో దేశంలో భయాందోళన సృష్టించాలని ప్రయత్నించే ఉగ్రవాదులను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. జమ్ము కశ్మీర్‌లో బీజేపీ బలోపేతానికి గుల్‌ అహ్మద్‌ కృషి మరువలేనిదని, ఆయన సేవలు చిరకాలం గుర్తుంటాయని వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలంలో గుల్‌ అహ్మద్‌ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Related posts