గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన వారి కోసం రెండో రోజూ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. . గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు 256 మందితో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయిల్ మరకల ఆధారంగా బోటు మునిగిపోయిన ప్రాంతాన్ని గుర్తించినట్లు సమాచారం.
300 అడుగుల లోతులో బోటును గుర్తించినట్లు తెలుస్తున్నది. బోటు కింద మరిన్ని మృతదేహాలు లభించే అవకాశముందని గాలింపు బృందాలు చెబుతున్నాయి. గల్లంతైన వారిలో చాలా మంది లాంచీలో చిక్కుకుపోయి ఉండే అవకాశముందని ఎన్డీఆర్ఎఫ్ భావిస్తోంది. ఇప్పటివరకు 12 మృతదేహాలు దొరికాయి. ఇవాళ గాలింపు చర్యలో 4, నిన్న 8 మృతదేహాలు లభించాయి. ఇంకా 39 మంది ఆచూకి తెలియాల్సి ఉంది.
రాజధానిని మార్చే అర్హత సీఎం జగన్కు లేదు: సీపీఐ నారాయణ