telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి పోరాటానికి ఎన్నారైల సంఘీభావం

amaravathi ap

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన పోరాటం నేటితో 200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి ప్రజల పోరాటానికి ప్రవాసాంధ్రులు మద్దతు తెలిపారు. వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారైలు అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.

అమెరికాలోని డెట్రాయిట్, మినియాపోలీస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, సియాటెల్, కాలిఫోర్నియా, డల్లాస్ ఆర్కాసాన్స్ తదిర నగరాలతోపాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, ఇంగ్లాండ్, కువైట్, ఐర్లాండ్, జర్మనీ ఎన్నారైలు ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాని మోదీ కలగజేసుకోవాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని తుంగలో తొక్కడం సరికాదని అన్నారు.

Related posts