telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పెళ్లిలో ఉల్లిదండలు మార్చుకున్న వధూవరులు

up marriage onians

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు చుక్కలనంటిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి పందిరిలోనే వినూత్న రీతిలో వధూవరులు వెల్లుల్లి దండలు మార్చుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని వారణాసీలో చోటు చేసుకుంది. ఈ పెళ్లికి వచ్చిన అతిథులు కూడా ఈ నూతన జంటకు ఉల్లిపాయలనే గిఫ్టులుగా ఇచ్చారు.

ఈ ఘటనపై సమాజ్ వాదీ పార్టీ నేత కమల్ పాటెల్ స్పందిస్తూ… ‘గత నెల నుంచి ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి కిలోకి రూ.120కు చేరాయి’ అని అన్నారు . ఇప్పుడు ఉల్లిని ప్రజలు బంగారాన్ని చూసినట్లు చూస్తున్నారు. అందుకే ఈ పెళ్లిలో వరుడు, వధువు ఈ ఉల్లి దండలను మార్చుకున్నారు. ఉల్లి ధరలు . ఉల్లి ధరలపై నిరసన తెలిపిందుకే ఈ జంట వినూత్న రీతిలో ఇలా దండలు మార్చుకుందని సమాజ్ వాదీ పార్టీ నేత సత్య ప్రకాశ్ అన్నారు.

Related posts