వరుస ఎన్నికల్లో ఘోర పరాజయంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. హుజూర్ నగర్ ఉపఎన్నిక అంశం నేతల మధ్య చిచ్చుపెట్టింది. గత ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచి.. ఆ తరువాత ఎంపీగా విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పద్మావతి పేరును టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రకటించడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైకమాండ్ కు చెప్పకుండా ఆమె పేరు ఎలా ప్రకటిస్తారని రేవంత్ ప్రశ్నించారు. దీంతో రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో టికెట్ను శ్యామల కిరణ్రెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాను ఆయన కలిశారు. ఉత్తమ్ కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం.
కోడెలపై ప్రభుత్వం ఒక్క కేసు కూడా పెట్టలేదు: ఉమ్మారెడ్డి